ఏడవ వేతన సంఘం బకాయిల విడుదల, తొలుత రక్షణశాఖ ఉద్యోగులకే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తోన్న ఏడో వేతన సంఘం బకాయిలను విడుదల చేసింది కేంద్రం. విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తోన్న ఏడో వేతన సంఘం బకాయిలను విడుదల చేసింది కేంద్రం. విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది.
ఏడవ వేతన సంఘం బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. తొలుత సైన్యంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు ఈ బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది.
డిఫెన్స్ లో పనిచేస్తోన్న పెన్షనర్లకు బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి సుభాష్ భమ్రే లోక్ సభకు తెలిపారు.
అన్నాడిఎంకె ఎంపి ఎం వాసంతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో రక్షణ రంగ పెన్షనర్లలో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్రలలోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4.21 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు ఉన్నారని లెక్కతేలింది.
కనీస వేతనాలను 7 వేల రూపాయాల నుండి రూ.18 వేల వరకు పెంచాలని జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తోంది. మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,53 లక్షల మంది పెన్షనర్లు ఏడో సంఘం వేతన సంఘం సిఫారసులు అమలైతే లబ్దిపొందుతారు.