చెన్నై పేలుడు: టెక్కీ స్వాతిని దురదృష్టం వెంటాడింది
హైదరాబాద్: చెన్నైలో బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో సంభవించిన బాంబు పేలుడులో మరణించిన టెక్కీ స్వాతిని దురదృష్టం వెంటాడింది. టిసిఎస్లో ఉద్యోగం చేస్తున్న స్వాతి తన ఇంటికి తిరిగి వస్తూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో స్వాతి విజయవాడకు బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో తత్కాల్ కింద టికెట్ బుక్ చేసుకుంది. ఈ మేరకు మీడియాలో శుక్రవారం వార్తలు వచ్చాయి.
దానికితోడు, తన సహోద్యోగిని, మిత్రురాలు రజితతో స్వాతి సీటు మార్చుకుంది. రజిత కూడా అదే రైలులో ఆమెతో పాటు బుధవారం రాత్రి ప్రయాణం చేసింది. నిజానికి నేరుగా మరో రైలులో గుంటూరుకు రావాలని స్వాతి అనుకుంది. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కింది.

రాత్రి స్వాతి అప్పర్ బెర్త్ మీద పడుకోగా, రజిత కింది బెర్త్ మీద పడుకుంది. గురువారం ఉదయం అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని, ప్రయాణికులు ఆందోళనతో అటూ ఇటూ పరిగెత్తడం ప్రారంభించారని, ఏం జరుగుతుందో తెలిసే లోగానే తనను ఎవరో రైలు నుంచి బయటకు లాగారని రజిత ఓ పత్రికతో చెప్పింది.
తాను స్వాతిని పిలిచానని, కానీ ఆమె కదలలేదని, స్వాతికి ఏం జరిగిందో కూడా తెలియలేదని, ప్రయాణికులు పరుగెత్తుతూ ఉండడంతో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుందని రజిత చెప్పింది. ప్రస్తుతం రజిత తీవ్ర దిగ్భ్రాంతి లోనైంది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications