నగ్మా వర్సెస్ ఝాన్సీరాణి: నగ్మా చెన్నైకి వచ్చినా ఝాన్సీ నో రెస్పాన్స్!
ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, సినీ నటి నగ్మాకు, టీఎన్సీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఝాన్సీరాణిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దీంతో మే 20న జరగాల్సిన టీఎన్సీసీ మహిళా విభాగం
చెన్నై: ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, సినీ నటి నగ్మాకు, టీఎన్సీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఝాన్సీరాణిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దీంతో మే 20న జరగాల్సిన టీఎన్సీసీ మహిళా విభాగం సమావేశం రద్దైనట్లు తెలిసింది.
వాస్తవానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా విజయధరణి ఉన్న సమయంలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ విభాగం బాధ్యతలను ఝాన్సీరాణికి అప్పగించారు. దీన్ని అనేకమంది మహిళా కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోయారు.

తమ కంటే జూనియర్ అయిన ఝాన్సీరా ణికి అధ్యక్ష పదవిని ఎలా కట్టబెడుతారంటూ రాష్ట్ర ఇంచార్జ్గా ఉన్న నగ్మాను నేరుగా ప్రశ్నించసాగారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఝాన్సీరాణిని నిలదీయడంతో వారిమధ్య మనస్పర్థలు తలెత్తాయి.

ఇటీవల నగ్మా చెన్నై పర్యటనకు వచ్చినపుడు వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన పర్యటన గురించి వివరాలు తెలియజెప్పేందుకు ఝాన్సీరాణిని ఫోనులో సంప్రదించగా ఆమె ఆందుబాటులో లేకుండా పోయారు. దీన్ని నగ్మా సీరియస్గా తీసుకోవడంతో మే 20న స్థానిక రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్లో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications