అదే ఆసుపత్రిలో చో రామస్వామి కన్నుమూత, జయ మృతి తెలియదు
జయలలిత కన్నుమూసిన అపోలో ఆసుపత్రిలోనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంపాదకులు చో రామస్వామి మృతి చెందారు. అయితే అదే ఆసుపత్రిలో జయలలిత మృతి చెందిన విషయం ఆయనకు తెలియదు.
చెన్నై: దివంగత జయలలిత కన్నుమూసిన అపోలో ఆసుపత్రిలోనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంపాదకులు చో రామస్వామి మృతి చెందారు. సోమవారం రాత్రి గ.11.30కు జయలలిత అపోలోలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
బుధవారం తెల్లవారుజామున గం.4.40కి చో రామస్వామి అదే ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే, జయలలిత మృతి చెందిన విషయం చో రామస్వామికి తెలియదు. ఇద్దరు ఒకే ఆసుపత్రిలో కన్నుమూసినప్పటికీ, ఇరువురి పరిస్థితి క్రిటికల్గా ఉన్నందున తెలియరాలేదు.
సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని వారాలకు.. అంటే నవంబర్ 29వ చో రామస్వామి అదే ఆసుపత్రిలో చేరారు. మొన్న శనివారం రోజు ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. దీంతో ఆయనను ఐసీయుకు తరలించారు.

ఆ తర్వాత ఆదివారం నాడు జయలలితకు గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆమెను సీసీయూకు తరలించారు. ఆమె సోమవారం రాత్రి కన్నుమూశారు. ఇరువురు కూడా ఒకే ఆసుపత్రిలో.. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు.
2015లో చో రామస్వామి ఆసుపత్రిలో ఉన్నప్పుడు జయలలిత సందర్శించారు. చో రామస్వామి ఆమెకు ఆప్తుడు, క్రిటిక్, గైడ్, అలాగే అడ్వయిజర్. ఇప్పుడు, అదే ఆసుపత్రిలోనే జయలలిత కన్నుమూసిన విషయం చో రామస్వామికి తెలియలేదు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications