ప్రాణం తీసిన 'కులం' : ఇంతకన్నా ఘోరం ఉంటుందా!
ఉత్తరప్రదేశ్ : దేశంలో అసమానతలను అత్యధికంగా ప్రభావితం చేసేవాటిల్లో కులం ఒకటి. ఏళ్లుగా భారతీయ సమాజం పునాదుల్లో పాతుకుపోయిన కులానికి నేటికి తలలు తెగిపడుతూనే ఉన్నాయి. అగ్రకుల దురహంకారం పెచ్చుమీరుతుండడంతో ఇప్పటికీ దళితులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని బాగేశ్వర్ జిల్లా కదారియలో నివసించే సోహాన్ రామ్ (31) గోధుమలు పట్టించడం కోసం స్థానికంగా ఉండే కుందన్ కుమార్ సింగ్ అనే వ్యక్తికి చెందిన పిండిమర దుకాణంకు వెళ్లాడు. అక్కడ గోధుమలను పట్టించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో.. లలిత్ కర్ణాటక్ అనే అనే అగ్రకుల ఉపాధ్యాయుడు అతనికి ఎదురుపడ్డాడు. దీంతో సోహాన్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టిన లలిత్.. సోహాన్ ను కులం పేరుతో దూషించాడు. సోహాన్ గోధుమలు పట్టించడం వల్ల పిండిమర మలినమైందని తీవ్రంగా అవమానించాడు.
అక్కడి తో ఆగిపోలేదు.. తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయిన్ లలిత్ సోహాన్ ను కొడవలితో నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లలిత్ ను అరెస్టు చేసి హత్య కేసుతో పాటు అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.
దీనిపై గ్రామస్తులు చెబుతున్నదేంటంటే.. నిజానికి కుందన్ పిండిమరను గ్రామంలోని దళితులు అగ్రకులస్తులు అందరూ వాడుకునేవారు. అయితే దసరా పండుగ నేపథ్యంలో తాము దుర్గామాతకు సమర్పించే నైవేద్యాల కోసం.. ముందుగా తాము పిండి పట్టించుకున్న తర్వాతే దళితులు ఆ పిండి మరను ఉపయోగించుకోవాలని అక్కడి అగ్రకులస్తులు ఆదేశించారు.
ఇదే క్రమంలో సోహాన్ పిండిని పట్టించుకోవడానికి వెళ్లడం.. సదరు అగ్రకుల ఉపాధ్యాయుడిని పట్టరాని ఆవేశానికి గురిచేసి, చివరకు హత్యకు దారితీసింది. పండుగలు దేవుళ్లు కూడా కులం పేరిట కలుషితమైన చోట ఇలాంటి అమానవీయ ఘటనలు ఇంకెన్నాళ్లో!
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications