డ్యాన్స్ బార్లకు పాత నిబంధనలే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు నిర్వహిస్తున్న వారికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. డ్యాన్స్ బార్లు ఇప్పటి వరకు పాటిస్తున్న పాత నిబంధనలనే కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
డ్యాన్స్ బార్లు నిర్వహించే వారికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. డ్యాన్స్ బార్లు రాత్రి 11.30 గంటలకు మూసివేయాలని, మద్యం విక్రయించరాదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నిబంధనలు పెట్టింది.
ముంబై నగరంతో సహ మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్లు నిర్వహిస్తున్న వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను తప్పుపట్టింది.

డ్యాన్స్ బార్లలో మద్యం విక్రయించరాదనుకుంటే మహారాష్ట్రలో మద్య నిషేధం విధించాలని సూచించింది. డ్యాన్స్ బార్లు, బార్లు లైసెన్స్ లు ఉన్న వారు మద్యం విక్రయించరాదని ఎలా చెబుతారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మహిళల గౌరవం కాపాడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని సుప్రీం కోర్టు చెప్పింది. డ్యాన్స్ బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగినట్లు అవుతుందని సుప్రీం కోర్టు తెలిపింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications