తీవ్ర నిరాశ: బాబా రాందేవ్పై డిగ్గీ రాజా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. తాజాగా యోగా గురు బాబా రాందేవ్ను దొంగ బాబా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
సోమవారం డిగ్గి రాజా మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. కానీ, బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.

నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రాందేవ్ కూడా నకిలీ బాబానేనని డిగ్గీ రాజా అన్నారు.
మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మకవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్ను అడిగారు.
అదే విధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. 14మంది నకిలీ బాబా ఉన్నారంటూ ఆకార పరిషత్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications