జయలలిత ఆస్తుల విలువలో పొరపాటు: మళ్లీ లెక్కలు చూస్తున్న జడ్జి?
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన ఇచ్చిన తీర్పును కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుమార స్వామి తిరిగి పరీశీస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు. అయినప్పటికీ బుధవారం ఉదయం పది గంటలకు న్యాయమూర్తి తన కార్యాలయానికి వచ్చారు. తీర్పుకు సంబంధించిన అంశాలను పరిశీలించారని తెలుస్తోంది.
జయలలిత ఆస్తుల విలువను లెక్కకట్టడంలో పొరపాట్లు దొర్లినందునే ఆమె శిక్ష నుండి తప్పించుకోగలిగారని, ఆమె ఆస్తి ఆదాయాని కంటే రూ.16.34 కోట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ హైకోర్టు రూ.2.82 కోట్లుగానే పరిగణించిందని కర్నాటక ప్రభుత్వ న్యాయవాది బీవీ ఆచార్య మంగళవారం చెప్పారు.

ఈ నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయమూర్తి గణాంకాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, హైకోర్టులో ఒకసారి ఇచ్చిన తీర్పును అదే న్యాయమూర్తి సవరించేందుకు వీల్లేదని నిపుణులు చెబుతున్నారు. గణాంకాల్లో తేడాలను గుర్తిస్తే, తీర్పును బదలీ చేయాల్సి వస్తే పైకోర్టుకు వెళ్లాల్సిందేనని అంటున్నారు.
జయలలిద నిర్దోషి అని కర్నాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అది అమలుకాకుండా సుప్రీం కోర్టు నుండి స్టే ఉత్తర్వును పొందేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరారు. డీఎంకే నేతలు కూడా సిద్ధరామయ్యను కలిశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications