కర్ణాటక పగ్గాలు యడ్యూరప్పకే: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం..

బెంగళూరు: కర్ణాటకలో అధికార పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలన్న మీమాంసకు గవర్నర్ వజుభాయ్ వాలా తెరదించారు. అంతా ఊహించినట్టుగానే బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రేపు ఉదయం 9గం.కు యడ్యూరప్ప సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణకు గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చారు.

yedyurappa

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 104 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేజిక్ ఫిగర్ 112 కావడంతో బలనిరూపణకు మరో 8మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి అవసరం. స్వతంత్రులను కలుపుకున్నా బీజేపీకి మేజిక్ ఫిగర్ సాధించడం కష్టం. కాబట్టి బలనిరూపణ విషయంలో ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీలను చీల్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు పంపించి జాగ్రత్తపడుతున్నాయి.

మొత్తం మీద రాబోయే 15రోజుల్లో కన్నడనాట మరిన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ఇంటిద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+