మళ్ళీ మొదలైన వలస కార్మిక వెతలు .. ఢిల్లీలో లాక్ డౌన్ తో 2020 సీన్ రిపీట్
దేశ రాజధాని ఢిల్లీలో వలస కార్మికుల కష్టాలు మళ్ళీ రిపీట్ అయ్యాయి . కరోనా కేసుల తీవ్రత నేపధ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ విధించటంతో వలస కార్మికుల సొంత ఊర్ల బాట పట్టారు . గత ఏడాది ఇదే సమయంలో వలస కార్మికుల వెతలు మళ్ళీ ఢిల్లీలో ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి . వేలాదిగా వలసకూలీలు తమ ప్రాంతాలకు వెళ్ళటానికి ఢిల్లీలో క్యూ కట్టారు .

ఢిల్లీలో ఆరు రోజుల కర్ఫ్యూతో వలస బాట పట్టిన కూలీలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం రాత్రి 10 గంటల నుండి ఢిల్లీలో ఆరు రోజుల కర్ఫ్యూ ప్రకటించిన తరువాత వలసకార్మికులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి అంతరాష్ట్ర బస్ టెర్మినల్స్ మరియు ప్రైవేటు బస్ డిపోలలో పోటెత్తారు. వేలమంది ఢిల్లీలోని ఆనంద్ విహార్ మరియు ఘాజిపూర్ మరియు ఘజియాబాద్ లోని కౌశాంబి వద్ద వలసదారుల సమూహాలు తమ ఊర్లకు బయలుదేరారు . 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తరువాత ఆనంద్ విహార్ వద్ద వేలాది మంది వలస కూలీలు తూర్పు ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ ప్రజలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ఎలాగైతే క్యూ కట్టారో ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితి ఉంది .

ఆనంద్ విహార్ వద్ద బస్సుల కోసం వేలాది కూలీలు
ఏదేమైనా, రైల్వే స్టేషన్లలో అదనపు రద్దీ లేకున్నా, కాశ్మీర్ గేట వంటి ఇతర అంతరాష్ట్ర బస్ టెర్మినల్స్, ఢిల్లీ నుండి పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ వైపు బస్సులు నడుస్తున్నాయి . ఆనంద్ విహార్ యుపిలోని చాలా గమ్యస్థానాలకు అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ కావడంతో అక్కడ వలస కూలీలు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి బారులు తీరారు. కోవిడ్ -19 కేసుల్లో భారీగా పెరుగుదల నేపథ్యంలో రాజధానిలో ఆరోగ్య సదుపాయాలను అధిగమించిన మరణాలను కట్టడి చేయడం కోసం సోమవారం కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలను ప్రకటించింది.

లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ విడిచి వెళ్లొద్దని విజ్ఞప్తి చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, లాక్డౌన్ విధించే నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి అంత సులభం కాదు ఇది పేద మరియు రోజువారీ కూలీ కార్మికులను ఎక్కువగా బాధిస్తుందని పేర్కొన్నారులాక్డౌన్ సమయంలో ఢిల్లీని విడిచిపెట్టవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని సీఎం స్వయంగా చెప్పారు. అయినప్పటికీ వలస కూలీలు మాత్రం తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి మొగ్గు చూపిస్తున్నారు.

ఆనంద్ విహార్, కౌశాంబి వద్ద క్యూ కట్టిన వలస కూలీలు
ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే, ఆనంద్ విహార్ వద్ద, మరియు కౌశాంబి వద్ద వలస కూలీలు గుంపులుగుంపులుగా తమ లగేజీ తో కనిపించారు . ఈ కొత్త లాక్డౌన్ కారణంగా మా కర్మాగారాలు మూసివేయబడతాయి. ఢిల్లీలో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరుగుతున్నందున, ఈ కర్ఫ్యూ ఎన్ని రోజులు కొనసాగుతుందనే దానిపై క్లారిటీ లేదు , ఇక్కడ బాధపడకుండా గ్రామాలకు తిరిగి వెళ్ళడం మంచిదని భావిస్తున్నామని వారు చెబుతున్నారు.

ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ చుట్టూ దాదాపు 8,000 మంది వలసదారులు
కౌశాంబి మరియు ఆనంద్ విహార్ బస్ టెర్మినల్, రైల్వే మరియు మెట్రో స్టేషన్లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సామర్థ్యానికి మించి వలస దారులు బారులు తీరారు . తూర్పు ఢిల్లీ మాల్ సమీపంలో ఉన్న మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిండిపోయింది. ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ చుట్టూ దాదాపు 8,000 మంది వలసదారులు తమ సొంత పట్టణాలకు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వలసదారులకు వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి అదనపు బస్సులు ఏర్పాటు చేయడానికి మేము రవాణా శాఖ అధికారులతో సంప్రదిస్తున్నాము అని అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ (తూర్పు) సంజయ్ సెహ్రావత్ చెప్పారు.

2020 వ సంవత్సరంలో వలస కూలీల కష్టాలు మళ్ళీ 2021 సంవత్సరం లో కూడా రిపీట్
ఏదేమైనా 2020 వ సంవత్సరంలో వలస కూలీల కష్టాలు మళ్ళీ 2021 సంవత్సరం లో కూడా రిపీట్ అయినట్లుగా కనిపిస్తుంది. తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి నానా అగచాట్లు పడుతున్నారు వలస కూలీలు. ఇక భారతదేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ విధించకుండా కట్టడి యత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి . విపరీతంగా పెరుగుతున్న కేసులు ప్రజలను మరోమారు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications