'కోల్గేట్'కు గండికొడుతున్న రాందేవ్ బాబా 'పతంజలి'
ముంబై: ఇటీవలే నూడుల్స్ మార్కెట్లోకి ప్రవేశించి ఆటా నూడుల్స్తో నెస్లే కంపెనీకి గండికొట్టిన రాందేవ్ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద.. ఆ తర్వాత టూత్ పేస్ట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ఈ రంగంలో రారాజుగా ఉన్న కోల్గోట్ పామోలివ్ వాటాకు గండికొడుతోంది.
ఇప్పటికే టూత్ పేస్ట్ మార్కెట్లో 4.5 శాతం వాటాను పతంజలి ఆయుర్వేద చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని కోటక్ ఇనిస్టిట్యూట్ ఈక్విటీస్ సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో కోల్గేట్ సంస్థ తన మార్కెట్ను గణనీయంగా కోల్పోయింది.

గత ఏడాది కోల్గేట్ పామోలివ్.. తన షేర్ను 60 పాయింట్ల నుంచి (100 పాయింట్లకు) 57.3 పాయింట్లకు తగ్గింది. పతంజలి ఆయుర్వేద కారణంగా రానున్న మూడేళ్లలో కోల్గేట్ తన వాటాని నాలుగు నుంచి పదిశాతం కోల్పోవచ్చునని భావిస్తున్నారు.
'దంత కాంతి' పేరుతో ఆయుర్వేద టూత్ పేస్టును పతంజలి విడుదల చేసింది. అందులో మెడికెటెడ్, అడ్వాన్స్డ్, జూనియర్ అనే మూడు రకాలను ప్రవేశ పెట్టింది. ఇక త్వరలోనే ఫుడ్ డ్రింకులు, బేబీకర్ ఉత్పత్తులను కూడా ప్రవేశ పెట్టి ఆ రంగాల్లో ఉన్న బహుళ జాతి సంస్థల గుత్తాధిపత్యానికి గండికొట్టాలని పతంజలి భావిస్తోంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications