మంత్రి అజంఖాన్ 7 గేదెల చోరీ, వెతికే పనిలో పోలీసులు
పలువురు పోలీసులు దొంగిలించిన వారిని పట్టుకొని, గేదెలను వెనక్కి తీసుకు వచ్చే పనిలో పడ్డారు. సమీపంలోని మూడు పోలీసు స్టేషన్ల నుండి పోలీసులు వెళ్లి వాటి కోసం గాలిస్తున్నారు. రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సాధనా గోస్వామి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహిస్తున్నారు.
గేదెలను ట్రేస్ చేసేందుకు స్నిఫ్పర్ డాగ్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. అజమ్ ఖాన్ ఉత్తర ప్రదేశ్ మైనార్టీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా, అజమ్ ఖాన్కు ఫాం హౌస్ నుండి శనివారం ఏడు గేదెలను ఎత్తుకెళ్లారు. ఆయన ఫామ్ హౌస్ రాంపూర్ జిల్లాలాలోని థనగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పసియాపురా గ్రామంలో ఉంది.
గేదెలు దొంగతనానికి గురయ్యాయనే విషయం తెలియగానే రాంపూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫూట్ ఫ్రింట్స్ ఆధారంగా గుర్తించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, దొంగిలించిన వారు రాంపూర్ బయటి నుండి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.