ఐఐటి మద్రాసులో ఇద్దరు మహిళల ఆత్మహత్య
చెన్నై: ఐఐటి మద్రాసు క్యాంపస్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. తమ గదుల్లో ఉరేసుకుని విజయలక్ష్మి, మహేశ్వరి అనే ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయలక్ష్మి ప్రొఫెసర్ గణేశన్ భార్య కాగా, మహేశ్వరి (34) రిసెర్చ్ స్కాలర్.

రిసెర్చ్ స్కాలర్ మృతికి ఐఐటి మద్రాసు విశ్వవిద్యాలయం సంతాపం తెలిపింది. మృతురాలి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. విజయలక్ష్మి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.
రిసెర్చ్ స్కాలర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మహేశ్వరి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారంనాడు ఈ రెండు ఆత్మహత్యల సంఘటనలు చోటు చేసుకున్నాయి.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications