ఐఐటి మద్రాసులో ఇద్దరు మహిళల ఆత్మహత్య
చెన్నై: ఐఐటి మద్రాసు క్యాంపస్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. తమ గదుల్లో ఉరేసుకుని విజయలక్ష్మి, మహేశ్వరి అనే ఇద్దరు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయలక్ష్మి ప్రొఫెసర్ గణేశన్ భార్య కాగా, మహేశ్వరి (34) రిసెర్చ్ స్కాలర్.

రిసెర్చ్ స్కాలర్ మృతికి ఐఐటి మద్రాసు విశ్వవిద్యాలయం సంతాపం తెలిపింది. మృతురాలి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. విజయలక్ష్మి మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.
రిసెర్చ్ స్కాలర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మహేశ్వరి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారంనాడు ఈ రెండు ఆత్మహత్యల సంఘటనలు చోటు చేసుకున్నాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications