రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానం: ఆ పెన్నుతో ఓటు వేస్తేనే చెల్లుతాయి
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలోలా కాకుండా ఈసారి ఎన్నికల ఓటింగ్ కోసం సరికొత్త పెన్నులు, వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలోలా కాకుండా ఈసారి ఎన్నికల ఓటింగ్ కోసం సరికొత్త పెన్నులు, వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు.
ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగులో ఉండే బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హర్యానాలో ఇంకు విషయంలో వివాదం తలెత్తింది.
రాష్ట్రపతి ఎన్నిక: ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లు
ఈ కారణంగా ఈసారి ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక పెన్నులను సిద్ధం చేశారు. ఈ పెన్నుల్లోని సిరా ఊదా రంగులో ఉంటుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న పెన్నులు తీసుకొని ఈ కొత్త పెన్నులను వారికి ఇస్తారు.
ఓటు వేశాక మళ్లీ తీసుకుంటారు. కేవలం ఈసీ ఇచ్చే ప్రత్యేక పెన్నులతో ఓటు వేస్తేనే చెల్లుతాయి. ఈసీకి సిరా సరఫరా చేసే మైసూరు కర్మాగారమే ఈ పెన్నులను సమకూర్చింది.