గుజరాత్ ఎన్నికలు: ఆ ముస్లీంలు మోడీ వైపే, ఏందుకంటే? పటేళ్ల బదులు, ఇదీ బీజేపీ లెక్క
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం గురువారం ముగుస్తోంది. 182 స్థానాలకు గానూ 89 సీట్లకు ఈ నెల 9న ఎన్నికలు జరుగుతాయి. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్, కచ్ ప్రాంతాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 977 మంది బరిలో ఉన్నారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఎక్కువ సీట్లు సంపాదించడం అన్ని పార్టీలకు ముఖ్యం.
బరిలో ఉన్న ప్రముఖుల్లో సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయన రాజ్కోట్ (పశ్చిమ) నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంద్రనీల్ రాజ్యగురు పోటీ చేస్తున్నారు. వస్త్ర, వజ్రాల వ్యాపారానికి పట్టుగొమ్మలాంటి సూరత్లో జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ మోడీ, రాహుల్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఈ తెగ మాత్రం బీజేపీకి అనుకూలం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీలంలలోని ఓ వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఎక్కడ ఎన్నికలు జరిగినా ముస్లీంలు గంపగుత్తగా బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తారు. కానీ గుజరాత్లో ఓ ముస్లీం తెగ మాత్రం బీజేపీకి అండగా నిలుస్తోంది. వీరు దావూదీ బోహ్రాలో షియా ఉప తెగకు చెందినవారు. వీరు ఎక్కువగా వాణిజ్య రంగంలో ఉంటారు.

అందుకే వారు మోడీకి మద్దతు
2014లో నాడు నరేంద్ర మోడీ నాటి ప్రధాని అభ్యర్థిగా ముంబైలోని ఆ తెగ పెద్ద సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ ఇంటికి వెళ్లారు. అలాగే, మోడీ ప్రధాని అయ్యాక పీఎంవోకు వెళ్లి కలిసిన తొలి ముస్లీం మత పెద్ద కూడా ఇతనే. వీరు కేవలం అభివృద్ధి పైనే దృష్టి సారిస్తుంటారని, అందుకే మోడీ అంటే వారికి అభిమానం అంటుంటారు. బీజేపీకి, మోడీకి వారు మద్దతివ్వడానికి అభివృద్ధి పట్ల వారి వైఖరి కారణమని చెబుతున్నారు.

ఈసారి ఎవరికీ టిక్కెట్ ఇవ్వలేదు కానీ
గతంలో ముస్లీం మెజార్టీ స్థానాల్లో పలుచోట్ల బీజేపీ ఆ వర్గాల అభ్యర్థిని బరిలోకి దింపితే ముస్లీంలోని ఇతర వర్గాలు కూడా మద్దతు ఇచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించేవారు. ప్రస్తుత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎవరికీ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ వారి అండను సంపాదించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ లెక్కలు
గుజరాత్లోని 30 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ఆధిపత్యం ఉంటుంది. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న ఈ నియోజకవర్గాల్లో పటేళ్ల ఓట్లు వల్ల కలగబోయే నష్టాన్ని భర్తీ చేసుకునేందకు బీజేపీ ముస్లీంలపై ఆధారపడుతుందనే తెలుస్తోంది. ఒక్కో చోట వెయ్యి నుంచి మూడు నాలుగు వేల ముస్లీంల ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గట్టెక్కుతారని అంటున్నారు. కాంగ్రెస్పై ముస్లింలలో ఉన్న అసంతృప్తి కూడా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications