భారత్ కు ఊహించని షాక్ ఇచ్చిన పాక్.. నెక్ట్స్ ఏంటి..?
భారత్ కు మరోసారి పాకిస్థాన్ షాకిచ్చింది. భారత్ కు చెందిన ఎయిర్ లైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ లు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా పాకిస్థాన్ మరోసారి గడువును పెంచింది. ఇదివరకు గడువు నవంబర్ 24 వరకు ఉన్న నేపథ్యంలో ఆ గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 వరకు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య విమానాల ప్రయాణానికి గగనతలాలు మూసివేసిన విషయం తెలిసిందే.
భారత్ విషయంలో పాకిస్థాన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ కు చెందిన విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ లు పాకిస్థాన్ గగనతలం మీదుగా వెళ్లకుండా ఇదివరకే ఉన్న గడువును తాజాగా మరోసారి పొడిగిస్తూ ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్రెష్ నోటీస్ టూ ఎయిర్ మెన్(NOTAM) జారీ చేసింది. గతంలో విధించిన రద్దు నిర్ణయం ఈ నెల 24 వరకు ఉంది. అయితే తాజాగా ఆ గడువును డిసెంబర్ 24 వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వలు నవంబర్ 19 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులను పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ జారీ చేసింది.
తాజా నిర్ణయంతో భారత్ నుంచి గుర్తింపు పొందిన అన్ని విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు, మిలిటరీ క్రాఫ్ట్ లు పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లడానికి నిషేధం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత ఎత్తు నుంచి అయినా కూడా ప్రయాణం చేయడానికి వీలు లేదని పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ స్పష్టం చేసింది.

ఇక జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన మారణహోమంలో ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక స్థావరాలపై దాడులు జరిపింది. వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందల మంది ఉగ్రమూకలు హతం అయినట్లు డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్.. -
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications