కరోనా మరణాలపై రగడ.. డబ్ల్యుహెచ్వో వర్సెస్ కేంద్ర వైద్యారోగ్యశాఖ.. 10 రెట్లు ఎక్కువ
కరోనా వైరస్ ప్రభావం దేశంలో తగ్గుముఖం పట్టింది. సెకండ్ వేవ్ అల్లాడించగా.. థర్డ్ వేవ్ ఇంఫాక్ట్ లేదు. జూన్లో ఫోర్త్ వేవ్ అన్నారు చూడాలీ.. అయితే కరోనా వల్ల చనిపోయిన మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కతీసింది. దేశంలో ఎక్కువగా జరిగాయని అనగా.. అబ్బే అదేం లేదని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్క సత్యదూరం అని కేంద్రం పేర్కొంది. దేశంలో జనన, మరణాల లెక్క పక్కాగా ఉంటుందని తెలిపింది. డబ్ల్యుహెచ్వో చెప్పిన గణాంకాలు సందేహాం కలిగిస్తున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 2020 నంచి డిసెంబర్ 2021 వరకు దేశంలో 4.7 మిలియన్ ప్జలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే ఇదీ పది రెట్లు ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అంటోంది.
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల లెక్క కూడా ఇలానే ఉంది. 15 మిలియన్ల జనం చనిపోయారని చెబితే.. వాస్తవంగా మాత్రం 6 మిలియన్లుగానే ఉంది. అదే సమయంలో దేశంలో 5.20 లక్షల మంది మాత్రమే కరోనాతో చనిపోయారు. డబ్ల్యూహెచ్వో డేటాపై వైద్యారోగ్య శాఖ గుర్రుగా ఉంది. 17 రాష్ట్రాల్లో మరణాలపై సందేహాం వ్యక్తం చేసింది. అదీవెబ్ సైట్లు, మీడియా రిపోర్ట్ల ఆధారంగా రూపొందించారని పేర్కొంది. ఇదే తేడా జరిగి ఉంటుందని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. పది రెట్ల మరణాలు ఎక్కువగా జరిగాయని చెప్పడం సత్యదూరం అని అంటోంది. ఇందుకు సంబంధించి డేటా తమ వద్ద ఉందని చెబుతుంది.