రెండు నౌకలు ఢీ: ఏడుగురి గల్లంతు
జపాన్కు చెందిన ఇజు ద్వీపకల్పానికి సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది గల్లంతయ్యారు.
టోక్యో: జపాన్కు చెందిన ఇజు ద్వీపకల్పానికి సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది గల్లంతయ్యారు.
అమెరికా నౌకా దళానికి చెందిన ఫిట్జ్ గెరాల్డ్ యుద్ధనౌక ఒక సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. దీంతో ఆ నౌకలోని కొంతభాగం దెబ్బ తినడంతో పాటు ఏడుగురు సిబ్బంది గల్లంతయ్యారు.

గల్లంతయిన వారి కోసం అమెరికా, జపాన్ దేశాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. యుధ్ధ నౌకను ఢీకొన్న ఏఎస్ఎక్స్ క్రిస్టల్ అనే సరుకు రవాణా నౌక ఫిలిప్పీన్స్కు చెందినది.
ఇది టోక్యో నుండి నగోయో రేవుకు వెయ్యి కంటెయినర్లను మోసుకెళుతోంది. ప్రమాదానికి ఈ నౌకనే కారణమని జపాన్ వార్తా సంస్థలు పేర్కొనగా, దానిని నౌక కెప్టెన్ ఖండించారు.












Click it and Unblock the Notifications