హైజాక్?: ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన హైదరాబాదీ యువకుడు
హైదరాబాద్: తన ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన నగరానికి చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం విమానాలను హైజాక్ చేస్తారంటూ ఓ మెయిల్ పంపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
హైదరాబాద్, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ముమ్మర తనిఖీలను నిర్వహించారు. ఈ-మెయిల్ పై ఆరా తీసిన ముంబై పోలీసులు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించి పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డికి సమాచారం ఇచ్చారు.
సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మెయిల్ చేసిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని అమీర్పేటకు చెందిన వంశీగా గుర్తించారు.

ఈ క్రమంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి పేరు మీద వంశీ మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. పుణెలో ఉన్న ప్రియురాలి వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వంశీ ఈ విధంగా చేసినట్లు పోలీసులు తేల్చారు. తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను పరుగులు పెట్టించిన వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications