హైజాక్?: ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన హైదరాబాదీ యువకుడు
హైదరాబాద్: తన ప్రియురాలి కోసం విమానాలను నిలిపేసిన నగరానికి చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం విమానాలను హైజాక్ చేస్తారంటూ ఓ మెయిల్ పంపడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
హైదరాబాద్, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ముమ్మర తనిఖీలను నిర్వహించారు. ఈ-మెయిల్ పై ఆరా తీసిన ముంబై పోలీసులు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించి పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డికి సమాచారం ఇచ్చారు.
సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మెయిల్ చేసిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని అమీర్పేటకు చెందిన వంశీగా గుర్తించారు.

ఈ క్రమంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి పేరు మీద వంశీ మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. పుణెలో ఉన్న ప్రియురాలి వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వంశీ ఈ విధంగా చేసినట్లు పోలీసులు తేల్చారు. తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను పరుగులు పెట్టించిన వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications