హీరో నితిన్కు షాక్: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ‘భీష్మ’ చిత్రం!, వెంటనే స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: కొత్త సినిమాల పైరసీకి వ్యతిరేకంగా సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు, నటీనటులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ.. పైరసీ మాత్రం తగ్గడం లేదు. సినిమాలు విడుదలైన రోజు లేదా ఆ తర్వాతి రోజే కొన్ని సైట్లలో ఆ సినిమాలు ప్రత్యక్షమవడంతో సినీ పరిశ్రమకు పెద్ద నష్టాన్నే కలిగిస్తున్నాయి.

ఆర్టీసీ బస్సులో భీష్మ చిత్రం..
తాజాగా టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్-రష్మీక మందన నటించిన భీష్మ చిత్రం కూడా పైరసీ బారిన పడింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్తో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపడుతున్న విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం.
నితిన్ ఫ్యాన్ సమాచారంతో..
ఓ ప్రయాణికుడు బస్సులో ప్రదర్శించిన భీష్మ చిత్రానికి సంబంధించిన విషయాన్ని మొబైల్లో చిత్రీకరించి ట్విట్టర్ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు. దీంతో హీరో నితిన్ ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్లోని పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విభాగం ప్రతినిధులు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైం పోలీసుల దృష్టికి..
ఫిబ్రవరి 21న భీష్మ చిత్రం విడుదల కాగా, నాలుగు రోజులకే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిత్రం ఇతర మాధ్యమాలు, సోషల్ మీడియాలోకి విస్తరించకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను పైరసీ వ్యతిరేక విభాగం కోరింది.
వెంకీ కుడుముల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన కేటీఆర్..
కాగా, భీష్మ చిత్రాన్ని టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించారు కేటీఆర్. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కు సూచించారు.
Recommended Video


చిత్ర బృందం ఆందోళన..
గతంలో పలుమార్లు కూడా ఇలా ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించడం గమనార్హం. కాగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. హిట్ టాక్ రావడంతో మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇలా పైరసీకి గురికావడం వల్ల చిత్ర కలెక్షన్లు దెబ్బతింటాయని చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications