రేషన్, పింఛను కోతే: విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్రపాలి హెచ్చరిక
వరంగల్: తమ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ఆమె బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్రపాలి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రెండు వారాల్లో జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరికీ ఓ పరీక్ష పెడతామని, దాంట్లో ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో చూసి గుర్తిస్తామని అన్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెలా ఒక రోజు తప్పనిసరిగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ను కలవాలన్నారు. ఎవరైతే రెండు నెలలు రారో వాళ్లకు రేషన్, పింఛను కోత విధిస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు.
బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ అమ్రపాలి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications