రేషన్, పింఛను కోతే: విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్రపాలి హెచ్చరిక
వరంగల్: తమ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ఆమె బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్రపాలి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రెండు వారాల్లో జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరికీ ఓ పరీక్ష పెడతామని, దాంట్లో ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నారో చూసి గుర్తిస్తామని అన్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెలా ఒక రోజు తప్పనిసరిగా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ను కలవాలన్నారు. ఎవరైతే రెండు నెలలు రారో వాళ్లకు రేషన్, పింఛను కోత విధిస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు.
బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ అమ్రపాలి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications