ఆ మంత్రి వేధిస్తున్నారు, పవన్ ఆదుకో, సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
నిర్మల్ జిల్లాకు చెందిన దేవేందర్ అనే వ్యక్తి తెలంగాణ సచివాలయం సి బ్లాక్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో కలిసి వచ్చిన ఆయన పురుగులమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవేందర్ భార్య, పిల్లలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ సచివాలయానికి వచ్చారు.

ఆయన సి బ్లాక్ ఎదుట ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. గతంలో గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవాలని వచ్చాడు.
కానీ. సిఎంను కలవలేదు.దీంతో ఆయన సి బ్లాక్ ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు సకాలంలో ఆయనను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
పవన్ ఆదుకోవాలి
సచివాలయం సి బ్లాక్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన దేవేందర్ వద్ద ఓ లేఖను పోలీసులు కనుగొన్నారు.ఈ లేఖలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జేసీ శివలింగయ్యలు మూడేళ్ళ నుండి తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించాడు. తనకు ఉపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రగతి భవన్ ముందుకు సమాధి చేయాలని కోరాడు.
ప్రజారాజ్యం పార్టీ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకొన్నానని చెప్పారు. చదువు వదిలేశా, తండ్రి, కొడుకుని పోగొట్టుకొన్నా అంటూ ఆ లేఖలో రాశాడు. చిరంజీవి సోదరులను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించా. సిబ్బంది అనుమతించలేదన్నారు. నా బిడ్డలను పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications