జగన్ కేసులో మరో కీలక మలుపు: సీబీఐ కేసు నుంచి ఐఏఎస్ అధికారికి ఊరట!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన కేసులో 12వ నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి, నాటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డీ మురళీధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
మురళీధర్ రెడ్డిపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

కేసు కొట్టివేయాలని మురళీధర్ రెడ్డి
ఈ అంశంలో తనపై రిజిస్టర్ అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ మురళీధర్ రెడ్డి హైకోర్టును గతంలో ఆశ్రయించారు. విచారణలో భాగంగా జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

పలువురు అధికారులకు ఊరట
జగన్ అక్రమాస్తుల కేసుల్లో పలువురు ఐఏఎస్ అధికారులపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మర అధికారి మురళీధర్ రెడ్డికి ఊరట లభించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

లేపాక్షి హబ్ కేసు
అనంతపురం జిల్లా లేపాక్షి హబ్లో ఇందూ గ్రూప్కు భూకేటాయింపుల్లో క్విడ్ ప్రోకో ఉందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో మురళీధర్ రెడ్డి 12వ నిందితుడిగా ఉన్నారు. ఈ చర్యను సవాల్ చేస్తూ మురళీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Recommended Video


ఎక్కడ లాభం చేకూరిందో నిరూపించడంలో విఫలం
కేసు విచారించిన హైకోర్టు ఆయన విచారణను తాజాగా నిలిపివేసింది. ఈ వ్యవహారంలో ఎక్కడ లాభం చేకూరిందో నిరూపించడంలో సీబీఐ విఫలమైందని చెబుతూ విచారణ ఆపేసింది. మురళీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications