టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కేటీఆర్తో భేటీ: కీలక బాధ్యతలు!
హైదరాబాద్: మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన శుక్రవారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో భేటీ అయ్యారు.
అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్కు మరోసారి తెరలేపారు. ఇందులో భాగంగా కేటీఆర్తో సురేష్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)తోను కేటీఆర్ భేటీ అయ్యారు.
మరోవైపు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కలిశారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. చెన్నూరు నుంచి ఈసారి ఎంపీ బాల్కసుమన్ బరిలోకి దిగుతున్నారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై ఓదేలు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా కేసీఆర్ను కలిశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
టీఆర్ఎస్లో పలువురికి టిక్కెట్లు ఇవ్వలేదు. 119 నియోజకవర్గాల్లో చాలామంది టిక్కెట్లు అడుగుతున్నారని కేసీఆర్ గురువారం ప్రెస్ మీట్ సందర్భంగానే చెప్పారు. 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, అందరికీ టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా చేయలేమని, టిక్కెట్ రాని వారి బాధ మేం చూసుకుంటామని చెప్పారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications