కొలిక్కి వచ్చిన డ్రగ్ కేసు: ఎఫ్ఎస్ఎల్ ఆ 'ఒక్క' నటుడికి షాక్, అందుకే ఆలస్యం
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక న్యాయస్థానానికి చేరింది. అది త్వరలో సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు) బృందం చేతికి రానుంది. డ్రగ్ కేసులో ఆరు నెలల క్రితం నటులు తరుణ్, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, దర్శకులు పూరీ జగన్నాథ్ సహా 12 మందిని విచారించిన విషయం తెలిసిందే.
తరుణ్, సుబ్బరాజు, పూరీలతో పాటు మరో ఇద్దరు శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం ఐదుగురివి తీసుకున్నారు. కొందరివి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఐదు కేసుల్లో నివేదికను ఫోరెన్సిక్ కోర్టుకు పంపించింది. ఇది సిట్ చేతికి రానుంది.
Recommended Video


ఒకరి నమూనాలో డ్రగ్స్
ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోర్టుకు వచ్చిన నేపథ్యంలో డ్రగ్ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఛార్జీషీటు దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. సమాచారం మేరకు సినీ పరిశ్రమకు చెందిన ఒకరిలో డ్రగ్స్ నమూనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

అందుకే ఆలస్యం
సాంకేతికంగా ఎవరూ తప్పుపట్టకుండా నమూనాలను రెండోసారి కూడా విశ్లేషణకు పంపడం వల్ల మొత్తం ప్రక్రియ ఆలస్యమైందని అంటున్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత సిట్ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు.

నమూనాలు ఇచ్చిన ముగ్గురు
డ్రగ్ సరఫరాదారు కెల్విన్ ద్వారా సమాచారం సేకరించి 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. విచారణకు హాజరైన వారిలో ముగ్గురు గోళ్లు, రక్తం, వెంట్రుకల నమూనాలివ్వగా మరో ముగ్గురు తిరస్కరించారు. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మిగతా దర్యాప్తు అంతా పూర్తి చేశారు.

కోర్టు ప్రశ్నించొచ్చు
సేకరించిన నమూనాలను తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ నివేదికకు పంపించారు. ఈ తరహా పరీక్షలేవీ గతంలో ఇక్కడ చేసి ఉండకపోవడం వల్ల కూడా ఆలస్యమైందని అంటున్నారు. ఢిల్లీ నుంచి అవసరమైన పరికరాలు తెప్పించి విశ్లేషించారు. న్యాయ విచారణలో భాగంగా ఈ విశ్లేషణ విధానాన్ని కోర్టు ప్రశ్నించే అవకాశముంది.

సిట్ చేతికి రానుంది
ఈ కారణంతో తెలంగాణ వైజ్ఞానిక పరిశోధనాశాల విశ్లేషించిన ఈ నమూనాలను మరోమారు ఐఐసీటీలో పునఃపరీక్షించారని తెలుస్తోంది. నివేదికలను కోర్టుకు సమర్పించారు. దర్యాప్తు అధికారులు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ నివేదికను తీసుకోనున్నారు. దీనిని చూసిన తర్వాత ఛార్జీషీట్లో జోడిస్తారు.
-
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications