పుట్టిన రోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య
వరంగల్: పుట్టిన రోజు వేడుకలకు రూ.500 ఇవ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది.
కూతురుకు పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనే ఆశ. కానీ ఆ తల్లిదండ్రులకు అంత ఇవ్వలేని నిస్సహాయత. దీంతో ఓ ప్రాణం పోయింది.

ఏకేతండా శివారు ర్యాగెట్ల తండాకు చెందిన గుగులోతు యాకూబ్ దంపతులు రోజువారీ కూలీలు. వారికి ఇద్దరు కొడుకులు. ఒక కుమార్తె. కుమార్తె శిరీష(12) వర్ధన్నపేటలోని ఎస్టీ వసతి గృహంలో ఏడో తరగతి చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. బుధవారం శిరీష పుట్టిన రోజు.
స్నేహితులతో కలిసి వేడుకలు చేసుకునేందుకు రూ.500 ఇవ్వాలని సోమవారం తల్లిని అడిగింది. ఆమె రూ.100 ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పింది. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే పురుగుమందు తాగడంతో వరంగల్లోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications