కాలేజీ భవనం పైనుంచి దూకి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వరంగల్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనంపైకి వెళ్లిన ఓ విద్యార్థిని అక్కడి నుంచి కిందకు దూకేసి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆ విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజగా తెలిసింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను లెక్చరర్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సింధుజ ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications