కాలేజీ భవనం పైనుంచి దూకి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వరంగల్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనంపైకి వెళ్లిన ఓ విద్యార్థిని అక్కడి నుంచి కిందకు దూకేసి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆ విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతున్న కందగట్ల సింధుజగా తెలిసింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను లెక్చరర్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సింధుజ ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications