కేసీఆర్, హరీష్లకి నేనేంటో చూపిస్తా: జగ్గారెడ్డి, 'కలెక్టర్ ఎలా పాసయ్యారో'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తన పైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తోందని, అలా చేస్తే తన తడాఖా ఏమిటో చూపిస్తానని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం నాడు హెచ్చరించారు. తనను ముట్టుకుంటే బాగుండదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
అమీన్పూర్ భూముల విషయంలో తనను జైలుకు పంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జైలుకైనా వెళ్తాకాని జైలుకైనా వెళ్తాకాని తెరాసలో మాత్రం చేరబోనన్నారు. తనను టార్గెట్ చేస్తే మంత్రి హరీష్ రావుకు విశ్వరూపం చూపిస్తానిన్నారు.
కేసీఆర్ పాలనపై దామోదర ఆగ్రహం
తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఆదివారం ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్మాణానికి గ్రామసభల అనుమతి అవసరం లేదని కలెక్టర్ చెప్పడం విడ్డూరమన్నారు.

మెదక్ కలెక్టర్ ఐఏఎస్ ఎలా పాసయ్యారో అర్ధంకావడం లేదని ప్రశ్నించారు. అధికారుల ప్రజాప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వ దోచుకుంటుందని మండిపడ్డారు. నిర్వాసితులకు 2013 జీవో ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాగా, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటోందని దామోదర శనివారం విమర్శించారు. తెలంగాణలో బలవంతపు భూసేకరణ జరుగుతోందన్నారు. దాని వల్ల దళితులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇదే అంశంపై ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో ఐదు పేజీల ప్రతులు అందించారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications