కేసీఆర్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారు!అదిష్టానం ఆదేశాల మేరకే పాదయాత్రలన్న భట్టి!
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలను నెలరోజుల వరకూ నిర్వహించాలనే డిమాండ్ ను సభలో ఉంచుతానన్నరు భట్టి.
హైదరాబాద్ : శాసనసభ బడ్జెట్ సమావేశాలు కనీసం 30 నుంచి 35 రోజుల పాటు నిర్వహించాలని బిఏసి సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా తీసుకొని ప్రజల గొంతుక అసెంబ్లీలో గళం వినిపిస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, వీటితో ముడిపడి ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు భట్టి విక్రమార్క.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల పూర్తవుతున్నా నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని, ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి స్పష్టమైనటువంటి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టడం కోసం తమ ప్రయత్నం కొనసాగిస్తామన్నారు భట్టి. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కోతలు, రుణమాఫీ, పోడు భూముల సమస్యలు, ధరణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన కరెంటు చార్జీల గురించి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మాట్లాడుతామన్నారు.

సంక్షేమ పధకాల అమలు నత్త నడక..
ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తదితర ప్రజల అంశాలపై శాసనసభలో లేవనెత్తి లోతుగా చర్చించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని,
ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల ప్రాధాన్యతను ఎంపిక చేసుకొని వాటి గురించి శాసనసభలో సుదీర్ఘంగా లోతైన చర్చ పెడతామన్నారు భట్టి. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వచ్చిన వినతులు అన్నింటిని పరిష్కరించాలని అసెంబ్లీలో లేవనెత్తుతానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు సరిగ్గా లేవన్నారు భట్టి.

రైతాంగానికి బడ్జెట్ లో ద్రోహం చేసారు..
2022-23 సంవత్సరంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 3.84 శాతం నిధులు కేటాయించగా ఈ సంవత్సరం 3.20 శాతానికి కుదించారని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ లాంటి పథకాలకు సైతం కోత పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో చాలామంది ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి ఏటా నిధులు పెంచాల్సిన ప్రభుత్వం కోతలు విధిస్తూ వస్తున్నదని ఆరోపించారు. అంతే కాకుండా విద్య వైద్యం రంగాలకు సైతం బడ్జెట్లో కోత పెట్టిందని, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదని, ఉద్యోగాల గురించి వూసే లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని మండి పడ్డారు.

పాదయాత్ర గురించి అధిష్టానం నిర్ణయం..
హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి ఈ నెల 4న తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు భట్టి విక్రమార్క. కార్యాచరణ ప్రణాళికను పార్టీ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పాల్గొనమంటే అక్కడ నుంచి పాల్గొంటానన్నారు. రాష్ట్రమంతా చేసే పాదయాత్ర గురించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, పాదయాత్ర చేయమని అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications