60ఎకరాల్లో టీఆర్ఎస్ ప్లీనరీ.. 75ఎకరాల్లో పార్కింగ్: కేటీఆర్
ప్రధాన సభ ప్రాంగణం 5ఎకరాల్లో ఉంటుందని తెలిపారు. మొత్తం ప్లీనరీ 60ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ 21శాతం వృద్ధి రేటుతో ముందు వరుసలో ఉందన్నారు.
ఇదే సందర్బంగా కొంపెల్లిలో ఈ నెల 21న నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల గురించి కేటీఆర్ వివరించారు. 10నుంచి 16వేల మంది ప్రతినిధులు ప్లీనరీలో పాల్గొంటారని, ప్రధాన సభ ప్రాంగణం 5ఎకరాల్లో ఉంటుందని తెలిపారు. మొత్తం ప్లీనరీ 60ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
సభకు హాజరయ్యేవారికి భోజన సదుపాయం, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సహా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతినిధులకు, వీఐపీలకు, మీడియాకు వేర్వేరుగా ఆరు భోజన శాలలు ఏర్పాటు చేస్తున్నామని, సీఎంకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుందని అన్నారు.

రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సమావేశ ప్రాంగణానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 75ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 31జిల్లాలకు సంబంధించిన 31కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. సమావేశ ప్రాంగణానికి కొన్ని ప్రధాన రహదారులను కూడా అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని తీరులో సంక్షేమాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 15వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. టీఎస్ఐపాస్తో పారిశ్రామిక విధానాన్ని కొత్త పుంతలు తొక్కించినట్లు తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీరు తీసుకొచ్చామన్నారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు ఇది ఆదర్శంగా నిలిచిందన్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications