ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీ రామారావు.. దివ్యాంగురాలైన ఓ యువ పెయింటర్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల మల్కాజ్గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు.

ఆమెకు మాటిచ్చిన కేటీఆర్
మస్క్యూలార్ డిస్ట్రోసీ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. చిత్రకళను కొనసాగిస్తున్న నఫీస్ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. అన్ని విధాలా సాయం అందిస్తామని హామి ఇచ్చారు.

అధికారులకు ఆదేశం
ఈ క్రమంలో ఆమెకు జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఆమె వైద్యానికి అవసరమైన సహాయాన్ని నిమ్స్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నెలకు రూ.10వేల పింఛను
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రూ.10లక్షలు జాయింట్ అకౌంట్లో జమచేసిన అధికారులు.. నెలకు రూ.10వేల చొప్పున పింఛను వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
కేటీఆర్ అభినందన
కాగా, కోరిన వెంటనే స్పందించి దివ్యాంగురాలిని ఆదుకున్న మంత్రి చందులాల్ తోపాటు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణను మంత్రి కేటీఆర్ అభినందించారు.
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications