తెలంగాణ, ఏపీల్లో స్కూల్స్: నారా లోకేష్, మంచు లక్ష్మీ మద్దతు(పిక్చర్స్)
హైదరాబాద్: అనాథ పిల్లల చదువుకోసం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్టీఆర్ మోడల్ పాఠశాలలను రెండు తెలంగాణ, ఆంధప్రదేవ్ రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున విస్తరించనున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్టు సహాయార్థం 'మెంటర్ ది హీరో' పేరుతో చిత్రకారుడు హరిశ్రీనివాస్ వేసిన చిత్రాల పద్రర్శనను ఆదివారం సాయంత్రం బేగంపేటలోని హెటెక్స్ కాకతీయలో లోకేష్ ప్రారంభించారు. లోకేష్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా ట్రస్టు తరుఫున సేవ చేస్తున్నానన్నారు.
ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పాఠశాలలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణల్లోని జిల్లాకో పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 3వేలమంది తమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తమ పాఠశాలల ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిద్దుతామని వెల్లడించారు.
కాగా, సినీ నటి మంచులక్ష్మి మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలకు మెంటర్గా ఉంటానని ప్రకటించారు. ట్రస్టు సీఓఓ మోహన్రావు మాట్లాడుతూ.. హరి చిత్రాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ పిల్లల చదువుకోసం వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. ట్రస్టు అధికారులు విష్ణువర్దన్, డా.విజయ్, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ తమ ప్రభావాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

నారా లోకేష్
అనాథ పిల్లల చదువుకోసం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్టీఆర్ మోడల్ పాఠశాలలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జిల్లాకొకటి చొప్పున విస్తరించనున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.

నారా లోకేష్
ఎన్టీఆర్ ట్రస్టు సహాయార్థం ‘మెంటర్ ది హీరో' పేరుతో చిత్రకారుడు హరిశ్రీనివాస్ వేసిన చిత్రాల పద్రర్శనను ఆదివారం సాయంత్రం బేగంపేటలోని హెటెక్స్ కాకతీయలో లోకేష్ ప్రారంభించారు.

నారా లోకేష్
లోకేష్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ట్రస్టు తరుఫున సేవ చేస్తున్నానన్నారు.
ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పాఠశాలలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నారా లోకేష్
ఏపీ, తెలంగాణల్లోని జిల్లాకో పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 3వేలమంది తమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. తమ పాఠశాలల ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిద్దుతామని వెల్లడించారు.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications