మణిపూర్కు సైన్స్ కాంగ్రెస్: ఓయూలో ఉద్రిక్తత, ఏయూకు నో ఛాన్స్
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాల్సిన ప్రతిష్టాత్మక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మణిపూర్కు తరలించారు. ఇటీవల వాయిదా వేసిన ఈ సదస్సును ఇప్పుడు మణిపూర్కు తరలించడంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొలుత హైదరాబాద్లోని ఉస్మానియాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు అసోసియేషన్ నిర్ణయించింది. అయితే, ఉస్మానియాలో నెలకొన్న పరిణామాలతో భద్రత సంస్థల ఆదేశాల మేరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడింది.

తిరిగి బుధవారం అసోసియేషన్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. ఉస్మానియాలో కాకుండా మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ సదస్సును తరలించారు.
కాగా, ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఓయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీరి రాజీనామాపై ఇంకా స్పష్టత రానప్పటికీ విద్యార్ధులు మాత్రం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ, రిజిస్ట్రార్, ప్రభుత్వ అసమర్ధత వల్లే మణిపూర్కు సైన్స్ కాంగ్రెస్ తరలిపోయిందంటూ విమర్శించారు.
ఇది ఇలావుంటే.. సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వేరేచోట నిర్వహించేందుకు అసోసియేషన్ ఆసక్తి చూడంతో ఆంధ్రా విశ్వవిద్యాలయంతోపాటు మరో ఏడు యూనివర్సిటీలు తమ పేర్లను ఇచ్చాయి. అయితే, ఏయూ ప్రతిపాదనను అసోసియేషన్ తిరస్కరించి, మణిపూర్కే అసోసియేషన్ మొగ్గుచూపింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications