తెరాసలో సమైక్యవాదులు: నాగం, ఎర్రబెల్లి ఫైర్
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సమైక్యవాదులు లేరా అని బిజెపి నేత నాగం జనార్దన్రెడ్డి ప్రశ్నించారు. మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన సోమవారంనాడు పాల్గొన్నారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్న ఘనత తెరాసకే దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రులు ఉత్పవ విగ్రహాలుగా మారారని నాగం విమర్శించారు.
మెదక్ ఉప ఎన్నికల నుంచి తెరాస పతనం ప్రారంభమవుతుందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నేతలను కొనే అలవాటు హరీష్రావుదే అని సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబితే హరీష్రావు సవాల్కు సిద్ధంగా ఉన్నట్లు ఎర్రబెల్లి ప్రకటించారు. ఈనెల 10న సిద్ధిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వంద రోజుల పాలనలో మోసం తప్ప చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీకి షరతులు విధిస్తున్నారని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అధికార టిఆర్ఎస్పై బిజెపి, తెలుగుదేశం పార్టీల కూటమి నాయకులతో పాటు కాంగ్రెసు నాయకులు దాడిని పెంచారు. మెదక్లో తెరాస నిమజ్జనం అవుతుందని కాంగ్రెసు అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications