ఏ పదవి ఐనా ఓకే: కేసీఆర్ గురించి తన పుస్తకంలో ప్రణబ్ ఏమన్నారంటే?
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో టిఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపించారు.'ది కొలిజన్ ఇయర్స్ 1996-2012' పేరుతో ప్రణబ్ ముఖర్జీ పుస్తకం రాసిన విషయం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో టిఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపించారు.
దిమ్మతిరిగే షాక్: యాత్రకు ముందు జగన్కు కొత్త అస్త్రాన్ని అందించిన రేవంత్
ప్రణబ్ ముఖర్జీ పుస్తకం
'ది కొలిజన్ ఇయర్స్ 1996-2012' పేరుతో ప్రణబ్ ముఖర్జీ పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
కేసీఆర్ గురించి ప్రస్తావన
అందులో భాగంగా ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి కూడా ప్రస్తావించారు. అందులో ఓ పేరాలో కేసీఆర్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన దాని గురించి రాశారు.
నాకు ఏ పదవి ముఖ్యం కాదు
తనకు ఏ పదవి ఇస్తారన్నది ముఖ్యం కాదని, తెలంగాణ ఏర్పాటు తనకు ముఖ్యమని కేసీఆర్ అప్పట్లో చెప్పారని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఒక్కటే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పేవారని ప్రణబ్ పుస్తకంలో రాశారు.
యూపీఏ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్
యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన పదవుల కోసమే యూపీఏలో చేరారని విపక్షాలు విమర్శించాయి. తెలంగాణ వచ్చాక తెరాస స్వల్ప మెజార్టీతో గెలిచింది. దీంతో కేసీఆర్ సీఎం అయ్యారు.