నీళ్లలో దూకి ఈత కొడుతూ వీడియో తీయమని.. శవమై తేలాడు
నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఘోరం జరిగింది. వీడియో సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తాను ఈత కొడతానని, దానిని వీడియో తీయమని స్నేహితులకు చెప్పిన శ్రీనివాస్ అనే యువకుడు మృతి చెందాడు.
చెరువులో ఈత కొడుతూ వీడియో తీయించుకుంటూ అతను నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి చెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లాడు. తన ఈత విన్యాసాలను వీడియో తీయాలని మిత్రునికి సెల్ఫోన్ ఇచ్చి నీళ్లలోకి దూకాడు.

అలా మొదటి సారి నీళ్లలోకెళ్లి విన్యాసాలు చేశాడు. అనంతరం బయటికి వచ్చి మరోసారి నీళ్లలోకి దూకాడు. వీడియో తీయమని స్నేహితులకు చెప్పాడు. అయితే నీళ్లలో దూకిన శ్రీనివాస్ కాసేపటికి కనిపించలేదు. ఇది కూడా వీడియో కోసమేనని భావించిన స్నేహితులు కాసేపు నిమ్మకుండిపోయారు.
ఎంతకూ కనిపించకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు అయినా శ్రీనివాస్ ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చి స్నేహితులను అడిగారు. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం తెలిసిందే.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications