యుఎస్ కాల్పుల్లో ఎన్నారై మృతి
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ నేవీ యార్డులో జరిగిన కాల్పుల్లో ఓ ఎన్నారై మరణించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేవీ యార్డ్లో దుండగులు సోమవారం రాత్రి జరిపిన కాల్పుల్లో దుండగుడితో పాటు 13 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎన్నారై విష్ణు పండిట్ (61) ఉన్నట్లు భావిస్తున్నారు.
మరణించిన వారిలో ఏడుగురి మృతదేహలను గుర్తించగా, మిగిలిన వారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. అమెరికాలోని అమెరికన్ నౌకాదళానికి చెందిన వాషింగ్టన్ నౌకాదళ యార్డులోకి ఆగంతకులు సైనిక దుస్తుల్లో చొరబడి కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరిని భద్రతాదళాలు కాల్చివేశాయి.

మరో దుండగుడికి కోసం వారు గాలిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.20 గంటలకు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నౌకాదళ యార్డులో 3000 మంది పని చేస్తుండగా, సైనిక దుస్తుల్లో వచ్చిన అగంతకులు ఈ చర్యకు పాల్పడ్డారు.
ఎదురు కాల్పుల్లో మరణించిన దుండగుడ్ని ఆరోన్ ఆలెక్సిస్గా గుర్తించారు. 34 ఏళ్ల అతను టెక్సాస్లోని ఫోర్త్ వర్త్కు చెందినవాడు. అతను 2007 నుంచి 2011 వరకు నేవీలో పనిచేశాడని చెబుతున్నారు. కాల్పుల సంఘటన అనంతరం అధ్యక్షుడు ఒబామా సంఘటన వివరాలు వెల్లడించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications