Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యమ పార్టీని వదలని వారసత్వ పోరు?

K Chandrasekhar Rao
వారసత్వం పేరుతో కాంగ్రెసు నిలువునా చీలి పోయింది. టిడిపిలో ఆధిపత్య విభేదాలు రాజుకుంటున్నాయి. ఇక రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ టిఆర్ఎస్‌ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. టిఆర్ఎస్‌లో పార్టీ వారసత్వంపై కలకలం చెలరేగుతున్నట్లుగా సమాచారం. అన్ని పార్టీలలో కుటుంబాల మధ్య వారసత్వ పోరు ఉన్నట్లే టిఆర్ఎస్‌లోనూ ఉన్నాయి. అయితే మిగిలిన పార్టీలకు టిఆర్ఎస్‌కు ఒక విషయంలో మాత్రం తేడా ఉంది. అన్ని రాజకీయ పార్టీల ఆధిపత్య పోరును, తెలంగాణ కోసం పని చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే ఉద్యమ పార్టీలో వారసత్వ పోరును వేరుగా చూడవచ్చు.

గత శాసనసమండలి ఎన్నికలలో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినప్పుడే ఉద్యమ పార్టీ అనే హక్కును కోల్పోయినట్టుగా పలువురు భావిస్తున్నారు. ఉద్యమం పేరు చెప్పి ఓటును అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలువురు టిఆర్ఎస్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వారసత్వ పోరు రసకందాయకంలో పడినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో మరింతగా దాని ప్రతిష్ట పలుచన పడిపోయే అవకాశం ఉంది. గత సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారక రామారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితల మధ్య తీవ్రంగా ఆధిపత్య పోరు నడిచిందని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారని సమాచారం. వీరు ముగ్గురు ఇప్పుడు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాగా ఆధిపత్య పోరును హరీష్‌రావు ఖండించారు. తామంతా ఒక్కటే అని కేసీఆర్ గ్రూప్ అని అన్నారు. తమ మధ్య విభేదాల్లేవు. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. ఉద్యమాన్ని బలపర్చాలని, రాష్ట్రాన్ని త్వరగా సాధించాలనే లక్ష్యాలతోనే పని చేస్తున్నామని చెప్పారు. కాగా శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, హరీశ్‌రావు చాలా సన్నిహితంగా మెలిగారు. పలుమార్లు గుసగుసలాడారు. ఇటీవల కాలంలో వివిధ సందర్భాల్లో మామ, మేనల్లుడు ఒకే వేదికను పంచుకున్నా, ఇలాంటి దృశ్యాలు మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు మాట్లాడాలని పలువురు డిమాండ్ చేయడంతో, కెసిఆర్ సరేననడంతో హరీశ్‌రావు మాట్లాడారు.

అనంతరం మాట్లాడిన కెసిఆర్ తన ప్రసంగంలో తన తనయుడు కెటిఆర్ గురించి ప్రధానంగా ప్రస్తావించడాన్ని బట్టి టిఆర్ఎస్‌లో వారసత్వ పోరు నడుస్తుందని అనుకోవచ్చు. పుణెలో ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చేసిన కెటిఆఱ్ సెలవులకు ఇంటికొచ్చినప్పుడు ఏం చేస్తావని తాను ప్రశ్నించానని, అయితే తననే సలహా ఇవ్వమని కోరడంతో సివిల్స్ రాసి ఐఏఎస్సో, ఐపీఎస్సో కావచ్చని సలహా ఇచ్చానని అయితే తన తనయుడు మాత్రం ఆ థర్డ్‌క్లాస్ ఉద్యోగం చేయనన్నాడు. ఐఏఎస్, ఐపీఎస్‌లంటే థర్డ్ క్లాస్ ఏమిటని అనడిగితే అది తన మాట కాదని, మా తరం మాట అన్నాడు.

అమెరికా వెళ్లి గ్లోబల్ సిటిజన్ అవుతానని చెప్పాడు. అలా వెళ్లి అక్కడే ఎంబీఏ పూర్తిచేశాడు. షిప్పింగ్ కంపెనీలో నెలకు రూ. 4-4.5 లక్షలు సంపాదించాడు. అక్కడ ఉజ్వల భవిష్యత్తు ఉన్నా తెలంగాణ కాజ్ కోసం ఉద్యమంలోకి వచ్చాడని చెప్పారు. ఇటీవలె ఓ పత్రికలో కూడా టిఆర్ఎస్ వారసత్వ పోరుపై కథనం రావడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+