వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాకు కలిగిస్తున్న చిరంజీవి ధోరణి, పార్టీలో తుపాను!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజకీయ నాయకుడిగా చిరంజీవి నటన సూపర్ గా ఉంది. జోగయ్య, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు కూడా వెళ్తున్నా చిరంజీవి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొదట్లో మంచి ఆదరణ కన్పించిన తూర్పు గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం గోడలు పునాదులతో సహా కూలుతున్నాయి. అల్లు అరవింద్, పవన్ కల్యాణ్ లు తమ సినిమాలతో బిజీగా ఉండి, ప్రజారాజ్యాన్ని ఆఫీసు బాయ్ లకు అప్పగించినట్టుగా ఉంది. చిరంజీవి మాత్రం తాను కన్న బిడ్డను తాను కాక మరెవరు చూసుకుంటారన్నట్టు బాధ్యత చూపిస్తున్నారు.

ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన ఆ 17మంది (చిరంజీవి మినహా) ఎమ్మెల్యేలు త్వరగా అధికార కాంగ్రెస్ లోకో, లేకపోతే టిడిపి లోకో ఫిరాయించాలని చూస్తున్నట్టు వారి కదలికలను బట్టి తెలుస్తోంది. పిఆర్పీ ఎమ్మెల్యేలు ముగ్గురు, నలుగురుగా డిన్నర్ సమావేశాలు పెట్టుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ లోకి ఫిరాయించాలంటే కనీసం మూడో వంతు మంది ఉండాలి. అంటే కనీసం ఆరుగురు ఉంటే తప్ప ఫిరాయింపు కుదరదు. అంతకంటే తక్కువైతే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలుగా అనర్హత వస్తుంది.

ప్రజారాజ్యంలో ఉంటే ఈసారి ఎన్నిక కావడం కష్టమన్న భయం వారిలో ఉంది. చిన్నపార్టీలో ఉండడం వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సరిగా సాగడం లేదన్న అసహనం వారిలో ఉంది. చిరంజీవి వారు ఎన్నిసార్లు ఆ విషయం చెప్పినా ఆయన సినిమా ఫక్కీలో పొంతన లేకుండా వేదాంత ధోరణిలో సమాధానాలు ఇవ్వడం వారికి చికాకు కలిగిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X