వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స అసంతృప్తి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి సామర్థ్యం మీద ఆయనకు పూర్తిగా అపనమ్మకం ఉందని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి కూడా అందరినీ కలుపుకుని పోయేలా లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. సమస్యలను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి విఫలమవుతున్నట్లు బొత్స సత్యనారాయణ భావిస్తున్నారట. మంత్రిగా ఉంటూ కిరణ్ కుమార్ రెడ్డికి లేఖలు రాయడానికి బొత్స సత్యనారాయణలోని అసంతృప్తే కారణమని అంటున్నారు.

సిమెంట్ ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బొత్స సత్యనారాయణ ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాశారు. యాజమాన్యాలు కుమ్మక్కయి సిమెంట్ ధరలు పెంచాయని, దానివల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కష్టమేనని బొత్స సత్యనారాయణ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఇటువంటి విషయాలేమైనా ఉంటే మంత్రివర్గం సమావేశంలో చర్చించడానికి బదులు లేఖలు రాయడం వెనక బొత్స సత్యనారాయణ అసంతృప్తే కారణమని చెబుతున్నారు.

తనకు కేటాయించిన శాఖ పట్ల మొదట్లోనే ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ మంత్రుల అసంతృప్తి గళాన్ని ఉమ్మడిగా వినిపించే వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచనలతో ఆయన వెనక్కి తగ్గారు. ముఖ్యమంత్రి పీఠం ఆశించి భంగపడడం బొత్సలోని అసంతృప్తికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

English summary
It is learnt that Minister Botsa Satyanarayana is unhappy with CM Kirankumar Reddy. It is said that Botsa is in a opinion that Kirankumar Reddy is not able to handle issues successfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X