కేశవరావు ఎపి ఎంపి: చంద్రబాబు ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. యాధృచ్ఛికంగా రాజ్యసభ సభ్యుల కేటాయింపులో కేశవరావు సీమాంధ్ర కోటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సివచ్చింది.
కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టడానికి చర్చకు రావాలంటూ తెరాస సెక్రటరీ జనరల్ కూడా అయిన కె.కేశరరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు.

కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు ఇలా సమావేశం ఏర్పాటు చేయడం పరిపాటి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్వహించే సమావేశానికి సీమాంధ్రకు చెందిన ఎంపీగా కేశవరావుకు ఆహ్వానం అందింది.
చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించడమా, కాదనడమా అనే సంకటస్థితిలో కేశవరావు పడ్డారని చెప్పవచ్చు. అయితే, చంద్రబాబు ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను తెలంగాణ వాడినని, అంతే కాకుండా తెరాసలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నానని, సీమాంధ్ర సమావేశానికి రాలేనని కేశవరావు చంద్రబాబుకు చెప్పారట.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications