వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలంలో బయటపడ్డ బంగారం, పరుగులు పెట్టారు

|
Google Oneindia TeluguNews

విజయనగరం: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

సాలూరు డివిజన్ పరిధిలోని పాచిపెంట మండలంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ వ్యక్తికి కొంత భూమి ఉంది. దీనిని సాలూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి లీజుకు తీసుకుని పంట పండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు భూమిని చదును చేశారు.

gold

అనంతరం కురిసిన వర్షాలకు ఓ యువతికి ఈ పొలంలో ఓ పెట్టె లభ్యమైంది. ఈ పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో వాటిని కడికి ఇంటికి తీసుకు వెళ్లారని అంటున్నారు. ఈ విషయం అంతటా పాకింది.

దీంతో, గ్రామంలోని మరికొందరు ఆ పొలంలోనికి వెళ్లి వెతకగా బంగారు పూసలు, ముక్కుపుడకలు, చైన్లు, మరికొన్ని వెండి ఆభరణాలు దొరికినట్లుగా చెబుతున్నారు. ఇది మండలమంతా తెలిసింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి బంగారు నగలు దొరికాయన్న పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వాటిని ఓ నగల దుకాణంలో అమ్మినట్లు తెలియడంతో విచారిస్తున్నారని తెలుస్తోంది.

English summary
Gold found in agri field in Vijayanagaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X