Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొలంలో బయటపడ్డ బంగారం, పరుగులు పెట్టారు

విజయనగరం: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

సాలూరు డివిజన్ పరిధిలోని పాచిపెంట మండలంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ వ్యక్తికి కొంత భూమి ఉంది. దీనిని సాలూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి లీజుకు తీసుకుని పంట పండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు భూమిని చదును చేశారు.

gold

అనంతరం కురిసిన వర్షాలకు ఓ యువతికి ఈ పొలంలో ఓ పెట్టె లభ్యమైంది. ఈ పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో వాటిని కడికి ఇంటికి తీసుకు వెళ్లారని అంటున్నారు. ఈ విషయం అంతటా పాకింది.

దీంతో, గ్రామంలోని మరికొందరు ఆ పొలంలోనికి వెళ్లి వెతకగా బంగారు పూసలు, ముక్కుపుడకలు, చైన్లు, మరికొన్ని వెండి ఆభరణాలు దొరికినట్లుగా చెబుతున్నారు. ఇది మండలమంతా తెలిసింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి బంగారు నగలు దొరికాయన్న పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వాటిని ఓ నగల దుకాణంలో అమ్మినట్లు తెలియడంతో విచారిస్తున్నారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+