పొలంలో బయటపడ్డ బంగారం, పరుగులు పెట్టారు
విజయనగరం: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
సాలూరు డివిజన్ పరిధిలోని పాచిపెంట మండలంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ వ్యక్తికి కొంత భూమి ఉంది. దీనిని సాలూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి లీజుకు తీసుకుని పంట పండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు భూమిని చదును చేశారు.

అనంతరం కురిసిన వర్షాలకు ఓ యువతికి ఈ పొలంలో ఓ పెట్టె లభ్యమైంది. ఈ పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో వాటిని కడికి ఇంటికి తీసుకు వెళ్లారని అంటున్నారు. ఈ విషయం అంతటా పాకింది.
దీంతో, గ్రామంలోని మరికొందరు ఆ పొలంలోనికి వెళ్లి వెతకగా బంగారు పూసలు, ముక్కుపుడకలు, చైన్లు, మరికొన్ని వెండి ఆభరణాలు దొరికినట్లుగా చెబుతున్నారు. ఇది మండలమంతా తెలిసింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి బంగారు నగలు దొరికాయన్న పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వాటిని ఓ నగల దుకాణంలో అమ్మినట్లు తెలియడంతో విచారిస్తున్నారని తెలుస్తోంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications