షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు..
డయాబెటిస్ అంటే కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాదు.. అది మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 'టైప్-1' డయాబెటిస్తో బాధపడేవారికి భవిష్యత్తులో డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన 'న్యూరాలజీ' పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ఇప్పుడు వైద్య లోకంలో చర్చనీయాంశమైంది.
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో సుమారు 2.83 లక్షల మందిపై ఈ సుదీర్ఘ అధ్యయనం జరిగింది. ఇందులో పాల్గొన్న వారి ఆరోగ్య రికార్డులను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

- టైప్-1 డయాబెటిస్: ఈ రోగులకు డిమెన్షియా వచ్చే అవకాశం ఇతరుల కంటే 3 రెట్లు ఎక్కువ.
- టైప్-2 డయాబెటిస్: వీరికి ఈ ప్రమాదం దాదాపు రెట్టింపు (2 రెట్లు) ఉంది.
గణాంకాల ప్రకారం, డయాబెటిస్ లేని వారిలో కేవలం 0.6% మందికి మాత్రమే డిమెన్షియా రాగా, టైప్-1 బాధితుల్లో అది 2.6% గా నమోదైంది.
ఎందుకింత ప్రమాదం?
వైద్య సంరక్షణ మెరుగుపడటంతో టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇప్పుడు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ వారిలో మెదడు సంబంధిత సమస్యలు (Cognitive decline) తలెత్తుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. టైప్-1 అనేది అరుదైన వ్యాధి (మొత్తం డయాబెటిస్ కేసుల్లో 5% మాత్రమే) అయినప్పటికీ, దీని ప్రభావం మెదడుపై చాలా బలంగా ఉంటోందని డాక్టర్ జెన్నిఫర్ వివరించారు. ఈ వ్యాధికి సంబంధించిన 65% డిమెన్షియా కేసులను నేరుగా డయాబెటిస్కే ఆపాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ముందు జాగ్రత్తే మార్గం
ఈ అధ్యయనం కేవలం డయాబెటిస్ మరియు డిమెన్షియా మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే చూపించింది తప్ప, ఒకదానికి ఒకటి కారణమని శాస్త్రీయంగా ఇంకా పూర్తిగా నిరూపించలేదు. అయినప్పటికీ, 65 ఏళ్లు పైబడిన డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మతిమరుపు వ్యాధిని నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.
-
ఆ స్టార్ హీరో ఫేవరెట్ "బంగాళ దుంప - దోసకాయ" కర్రీ ఎలా చేయాలంటే..? -
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications