వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతో వైఎస్, డిఎస్ భేటీ నేడే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఏదో ఒక సమయంలో సోనియా గాంధీని కలుసుకోనున్నారు. తెలంగాణ ఏర్పాటుపై వీరప్పమొయిలీ చేసిన ప్రకటనలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసరంగా ఢిల్లీకి రావాలని వైఎస్కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో వైఎస్ నిన్ననే ఢిల్లీకి వెళ్లగా, డీఎస్ ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. సోనియాతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ కోర్కమిటీ ప్రత్యేక సమావేశంలో వీరిద్దరూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం విషయంలో వైఎస్ కు డిఎస్ కు విభేదాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల నష్టం జరుగుతుందని డిఎస్ హై కమాండ్ కు నివేదించగా అటువంటిదేమీ లేదని, తెలంగాణలో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ స్ధానాలు చేజిక్కించుకోగలదని వైఎస్ చెబుతూ వస్తున్నారు.
Comments
Story first published: Monday, January 19, 2009, 17:31 [IST]