ప్రజలకు స్పీకర్ క్షమాపణలు

శాసనసభలో జరుగుతున్న వ్యవహారాల తీరును చూసి సభను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సభ్యుల సస్పెన్షన్ గానీ, మార్షల్స్ చేత బయటకు పంపించడం గానీ కొత్తేమీ కాదని ఆయన అన్నారు. మార్షల్స్ కూడా ప్రభుత్వోద్యోగులేనని, తన ఆదేశాల మేరకే వారు పనిచేశారని ఆయన అన్నారు. సస్పెండ్ చేసిన తర్వాత సభ్యులు తమంత తాము సభ నుంచి వెళ్లిపోవాలని, అలా వెళ్లనప్పుడు మార్ష్లల్స్ చేత బయటకు పంపడం ఆనవాయితీ అని ఆయన చెప్పారు. విచారణలో ఎవరిని ఏమన్నారో బయట పడుతుందని ఆయన అన్నారు. శాసనసభలో చర్చకు, నిరసనకు, ఆందోళనకు, విభేదాలకు అవకాశం ఉందని, అయితే ఈ విషయాల్లో గీత దాటకూడదని, గీత దాటితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఆలోచన చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications