ఏదో ఒకరోజు జయం సాధిస్తాం: చిరంజీవి

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తానే పట్టుబట్టి సామాజిక న్యాయం మేరకు పార్టీ తరఫున 104 మంది బీసీలకు టిక్కెట్లు ఇప్పించానని చెప్పారు.. ఏడాదిన్నర కిందట పార్టీ ఏర్పాటుకు ముందు తనకు పూలే అంటే ఎవరో తెలియదని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని భావించినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నానని చెప్పారు. అసమానతలు తొలగించటానికి అంబేద్కర్, పూలే వంటి మహానుభావులు కృషి చేస్తేనే పూర్తిస్థాయి ఫలితాలు ఇప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని వర్గాలదే ఆధిపత్యంగా ఉందని, మిగిలిన వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. శాసనసభలో పూలే విగ్రహం పెట్టేలా, ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. పార్టీ భావజాల ప్రతినిధి కత్తి పద్మారావు మాట్లాడుతూ ''కాంగ్రెస్లో ఎన్నటికీ పార్టీ విలీనం కాదు... ఎదురు నిలబడి పోరాడుతుంది'' అంటూ వేదికపై నుంచి గట్టిగా నినాదాలు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఎన్.టి.రామారావు సామాజిక న్యాయాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లారని, తెదేపాలో నాయకత్వం మారాక దీన్ని పట్టించుకోలేదని విమర్శించారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications