జులై రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు: రమాకాంత్ రెడ్డి

ఎంపిటీసి, జడ్పిటీసి ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 60.50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోవని, ప్రభుత్వం స్థానిక సంస్థలను ప్రత్యేకాధికారుల ఆధీనంలోకి తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications