మమ్మూటీని ఏడు గంటలు ప్రశ్నించిన ఐటి అధికారులు
అయితే చెన్నై నుంచి బయలు దేరేందుకు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్న మమ్మూటీకి భారీగా తరలి వచ్చని అభిమానులు అండగా నిలిచారు. మమ్మూటీ ఇంటికి చేరుకున్న తరువాత మరిన్ని సోదాలు నిర్వహించామని ఆదాయ పన్ను శాఖ అదనపు సంచాలకులు ఆర్.మోహన్ తెలిపారు. భూములకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను సేకరించామని, తమ దాడుల వివరాలను బుధవారం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
మమ్మూటీ, మోహన్ లాల్ ల ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల పై మూకుమ్మిడిగా సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కొచ్చి, తిరువనంతపురం, చెన్నై, బెంగుళూరు, ఊటీలలోని ఆస్తుల పై దృష్టి సారించారు. షూటింగ్ ల నేపధ్యంలో రామేశ్వరంలో ఉన్న మోహన్ లాల్ ను చెన్నైలో 25వ తేదిన, కొచ్చిలో 26వ తేదిన ప్రశ్నించనున్నట్లు అధికారి మోహన్ తెలిపారు. వీరికున్న ఆస్తులు, వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఆదాయపన్నులు చెల్లించటం లేదంటూ వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు గత కొద్ది కాలంగా వీరి ఇరువురి ఆస్తుల పై నిఘా వేశారు. అయితే రాజ్యాంగం పరిధిలోని సెక్షన్ 132ను అనుసరించి ఐటీ అధికారులు విచారణనను డీల్ చేస్తున్నారు.