హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సకల జనుల సమ్మె, నిలిచిన బొగ్గు ఉత్పత్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సకల జనుల సమ్మె పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం సమ్మె ప్రారంభమైంది. మొదటి రోజు సకల జనుల సమ్మెలో టిఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, సింగరేణి కార్మికులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పాల్గొన్నాయి. ఎవరూ తమ విధులకు హాజరు కాలేదు. వరంగల్‌లోని భూపాల్ పల్లి, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, అదిలాబాద్‌లోని బెల్లంపల్లి, శ్రీరాంపూర్, కరీంనగర్ జిల్లా తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది.

సింగరేణిలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, లాంగ్ వాల్ ప్రాజెక్టులలో ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కేవలం భూపాల్ పల్లిలోనే 7వేల మంది, ఇల్లందులో మూడు వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద తెలంగాణ ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. పలు జిల్లా కలెక్టరేట్‌ల వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రైవేటు పాఠశాలల సంఘం వరంగల్‌లో ప్రకటించింది.

తెలంగాణ న్యాయవాదులు విధులకు హాజరు కారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదులు విధులకు హాజరు కాకుంటే కోర్టు దిక్కరణ కింద చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కాగా తెలంగాణలో సకల జనుల సమ్మెకు మద్దతుగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ తెలంగాణ శాసనసభ్యులు కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.

English summary
Sakala Janula Samme started today. Singareni workers, private college lecturers, TNGO participated on first day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X