వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్ల కేసులో పురోగతి, ఇద్దరి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blasts
ముంబై: ముంబై వరుస పేలుళ్ల కేసులో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) పురోగతి సాధించింది. ఈ కేసులో ఎటిఎస్ ఇద్దరిని అరెస్టు చేసింది. నిరుడు జులై 13వ తేదీన జరిగిన వరుస పేలుళ్లలో 27 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ, మధ్య ముంబైలోని జవేరీ బజార్, ఓపెరా హౌస్, దాదర్‌ల్లో పేలుళ్లు సంభవించాయి. ముగ్గురిని కూడా ముంబై పోలీసులు బీహార్‌లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల ప్రధాన సూత్రధారిని మోస్ట్ వాంటెడ్ యాసిన్ భక్తల్‌గా భావిస్తున్నారు.

బీహార్‌లోని దేవరా భంగోళి గ్రామానికి చెందిన 22 ఏళ్ల నఖీ అహ్మద్‌ను, 23 ఏళ్ల నదీం అక్తర్‌ను అరెస్టు చేసినట్లు ఎటిఎస్ చీఫ్ రాకేషన్ మారియా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. హరోన్ యాసిన్ నాయక్ అనే వ్యక్తికి పేలుళ్లతో ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే పేలుళ్లకు ఆర్థిక సాయం అందించాడని ఆయన చెప్పారు. పేలుళ్లకు వాడిన స్కూటర్లను నఖీ, అక్కర్ దొంగిలించినట్లు ఆయన తెలిపారు.

జులై 13వ తేదీన జరిగన పేలుళ్ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. యాసిన్ భక్తల్ నఖీ అహ్మద్‌కు 1.5 లక్షల రూపాయలు ఇచ్చాడని ఆయన తెప్పారు. భక్తల్ ఢిల్లీలో పేలుడు పదార్థాలు, డెటొనేటర్లు అందించినట్లు ఆయన తెలిపారు.

English summary
One of India’s most wanted men, Yasin Bhatkal, had planned and executed the deadly triple blasts that rocked Mumbai on July 13, 2011, the Maharashtra Anti-Terrorism Squad (ATS), which cracked the case, said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X